కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు

83చూసినవారు
రాజమండ్రి సిటీలో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు శుక్రవారం కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇచ్చేందుకు కవాతు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలెవరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్