కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి 29వ తేదీ రాజమండ్రి నగరానికి రానున్నారని కాంగ్రస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రకటించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.