తెలుగువారి గుండెల్లో ఎస్వీఆర్ నటన సజీవం

62చూసినవారు
సామర్ల వెంకట రంగారావు (ఎస్వీఆర్) నటన తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ సజీవమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం ఎస్విఆర్ జయంతి సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గల ఎస్వీఆర్ నిలువెత్తు విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు, ఎస్విఆర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్