రైతు బజార్ స్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు

70చూసినవారు
కడియంలో నిర్మిస్తున్న రైతు బజార్ ని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం అన్నారు. మంగళవారం రైతు బజార్ స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు బజార్ నిర్మాణానికి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. పైగా స్థానికంగా ఉన్న స్థలాన్ని కబ్జా చేశారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్