రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని రాజానగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. బుధవారం రాజానగరం నియోజవర్గ టీడీపీ కార్యలయంలో ఉమ్మడి నాయకులు నిర్వహించిన సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వారిపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.