రాజానగరం నియోజవర్గంలోని ఎస్. టి రాజపురంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పైలా బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, కౌన్సిలర్ జి. వీర్రాజు సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు.