తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద మోడల్ ఈవీఎంను రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా గురువారం పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించడం మనందరి సామాజిక బాధ్యత అని యువ ఓటర్లు తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పి పి జగదీష్, ఆర్డీవో చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.