ఎంపీటీసీ దారుణ హత్య

66చూసినవారు
ఎంపీటీసీ దారుణ హత్య
వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యాడు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోద‌డంతో ఆయ‌న అక్కడికక్కడే మృతి చెందాడు.ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఇద్దరి నిందితులు ఏటపాక పోలీస్ స్టేషన్​లో లొంగిపోయారు. పోలీసులు ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్