సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు సచివాలయాలను రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వేట మామిడి సచివాలయం, అడ్డతీగల 1, 2 సచివాలయాల రికార్డులను, జీ. సి. సి గోడౌన్ లను పరిశీలించారు. అనంతరం రాజవొమ్మంగి సచివాలయంలో రాజమండ్రి వారు ఏర్పాటు చేసిన గౌతమి నేత్రాలయం వారి కంటి పరీక్షల కార్యక్రమంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులందరూ విధి నిర్వహణలో బాధ్యతతో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్