మలికిపురంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: ఎమ్మెల్యే

59చూసినవారు
మలికిపురంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: ఎమ్మెల్యే
ఈ నెల 28, 29 తేదీలలో మలికిపురంలోని ఎంవిఎన్, జేఎస్ఆర్వీఆర్ డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీల కరపత్రాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ మేరకు పోటీల నిర్వహకులు ఆయనను విశ్వేశ్వరాయపురంలోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పోటీలకు హాజరుకావాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ నరసింహారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్