జగన్ సమక్షంలో వైసీపీలోకి రాజుబాబు
రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన దళిత నాయకుడు నక్కా రాజుబాబు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నక్కా రాజుబాబు, ఆయన కుమారుడు రాజేంద్ర వైఎస్ఆర్సీపీలో చేరారు.