ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవితాశయమని.. దాన్ని తప్పక సాధిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. అందరిని మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు సీఎం జగన్ అని విమర్శించారు. ఇలాగే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.