నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ కోరారు. మంగళవారం భీమవరం సీఎస్ఎన్ కళాశాల వద్ద వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. నీట్ పరీక్ష దేశ చరిత్రలో కనీ, వినీ ఎరగని రీతిలో ఈ ఏడాది అవకతవకలు జరిగాయని ఆరోపించారు.