దెందులూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మంగళవారం ప్రజాగళం బహిరంగ సభలో వంగవీటి రాధా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కాను, బటన్ నొక్కాను అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బు నొక్కేశాడో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. అలాగే సింహాలు పులులు అంటున్నాడు అని కానీ సింహాలు, పులులు ఉండాల్సింది అడవిలో అని సూచించారు. అలాగే జనసేనపై ప్రస్తావిస్తూ పులివెందుల పిఠాపురమా అని అన్నారు.