ఏలూరులో టీడీపీ సంకల్పయాత్ర సభ

61చూసినవారు
ఏలూరు నగరంలోని స్థానిక చిరంజీవి బస్టాండ్ వద్ద శుక్రవారం నిర్వహించిన టీడిపి సంకల్ప యాత్ర కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారో అదేవిధంగా బడేటి కుటుంబం కూడా ప్రజల మధ్యనే ఉందని అన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో బడేటి కుటుంబానికి ప్రజలందరూ అండగా నిలబడాలని కోరారు.

సంబంధిత పోస్ట్