ఢిల్లీ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాజౌరి గార్డెన్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని రాజౌరి గార్డెన్లో నివాసం ఉంటున్న రాజన్ సేథ్గా మెట్రో పోలీసులు గుర్తించారు. చికిత్స నిమిత్తం రాజన్ సేథ్ ను ఆసుపత్రికి తరలించారు. కుటుంబంతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానని రాజన్ సేథ్ పోలీసులకు తెలిపాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.