నూజివీడు: మహిళ నన్ను మోసం చేసింది: వైసీపీ నేత

81చూసినవారు
నూజివీడుకు చెందిన ఓ మహిళ తనతోపాటు చాలా మందిని చీటింగ్ చేసిందని వైసీపీ నేత యోగి ఆరోపించారు. నూజివీడు పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేకమంది బయట వ్యక్తులనే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులను సైతం మహిళ చీటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నాకు పదే పదే ఫోన్ చేసి చంపిస్తానని బెదిరిస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్