చికిత్స పొందుతూ యువకుడు మృతి

71చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడు మృతి
తాడేపల్లిగూడెం దానమ్మ గుడి వద్ద మామిడి తోటకు చెందిన మోటార్ సైకిల్ మెకానిక్ ప్రసన్నకుమార్, అదే ప్రాంతానికి చెందిన యర్రా సతీశ్ మధ్య పాత గొడవల నేపథ్యంలో ఇటివల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ తలపై ఇనుప రాడుతో సతీశ్ కొట్టాడు. దీంతో ప్రసన్నకుమార్‌ను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్