మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్

81చూసినవారు
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్
మున్సిపాలిటీలో తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు శనివారం తెలిపారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గా ఆయన బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇన్ ఛార్జ్ కమిషనర్ మురళీకృష్ణ, ఆర్వో రవి సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్