తాడేపల్లిగూడెం: దసరా ఉత్సవాల్లో భాగంగా గాయత్రీ దేవి అలంకరణ

79చూసినవారు
తాడేపల్లిగూడెం: దసరా ఉత్సవాల్లో భాగంగా గాయత్రీ దేవి అలంకరణ
తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బలుసులమ్మ దేవస్థానం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం గాయత్రీ దేవిగా అలంకరించారు. అలాగే ముత్యాలంబాపురం శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలోని అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదమాత గాయత్రీ దేవిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.

సంబంధిత పోస్ట్