తాడేపల్లిగూడెం: వేదమాత గాయత్రి దేవిగా విశ్వదుర్గేశ్వరి మాత

70చూసినవారు
తాడేపల్లిగూడెం: వేదమాత గాయత్రి దేవిగా విశ్వదుర్గేశ్వరి మాత
తాడేపల్లిగూడెం పట్టణంలోని విశ్వదుర్గేశ్వరపేటలో గల విశ్వదుర్గేశ్వరి అమ్మవారు శుక్రవారం వేదమాత గాయత్రి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి పలువురు దాతలు రెండు లడ్డులను అందజేశారు. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్