పశ్చిమగోదావరి జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్లను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115 రద్దు చేయాలని కోరారు. అలాగే ఏఎన్ఎంలను జీఎన్ఎంలుగా ఇచ్చిన ఉద్యోగోన్నతిని రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.