తణుకు: పాల కేంద్రంలో దొంగతనం

85చూసినవారు
తణుకు పట్టణంలోని ఒక పాల కేంద్రంలో దొంగలు శుక్రవారం తెల్లవారుజామున చోరికి పాల్పడ్డారు. పట్టణంలోని స్థానిక ఆలమూరివారి వీధిలో శ్రీనివాస మిల్క్ ‌డైరీలో ముగ్గురు వ్యక్తులు షట్టర్‌ తాళాలు పగలగొట్టి లోపల ఉంచిన రూ. లక్ష నగదును అపహరించుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. యజమాని రాజబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్