పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

84చూసినవారు
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ఉంగుటూరులోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు.
రిటర్నింగ్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్