రేపటి నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు

68చూసినవారు
రేపటి నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఈఏపీసెట్-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును 1 నుంచి 7వ తేదీలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జులై 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 8 నుంచి 12న వెబ్ ఆప్షన్, 16న సీట్లను కేటాయిస్తారు.

సంబంధిత పోస్ట్