ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటీ చేశారు.