ముదివేడు కస్తూర్బా ప్రిన్సిపల్‌తో సహా నలుగురు సస్పెండ్

67చూసినవారు
ముదివేడు కస్తూర్బా ప్రిన్సిపల్‌తో సహా నలుగురు సస్పెండ్
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్‌తో సహా నలుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్