వింత వ్యాధితో నలుగురు మృతి.. భయం గుప్పుట్లో గిరిజనులు

67చూసినవారు
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ చింతలూరు గ్రామ‌స్తులు భయం గుప్పెట్లో బ‌తుకుతున్నారు. వారం రోజుల్లో గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. వింత వ్యాధితో మృతి చెందుతున్నారని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు. కళ్లు తిరగడంతో పాటు వాంతులు, విరేచనాలతో ఇప్పటికే నలుగురు మృతిచెందారు. కొంతకాలంగా గ్రామంలో తాగునీటి సమస్య ఉండటంతో గ్రామ‌స్తులు ఊటనీరు తాగుతున్నారు.

సంబంధిత పోస్ట్