పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు చేపట్టింది. విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న వాహనంలో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.