బీబీసీ నూతన ఛైర్మన్గా డాక్టర్ సమీర్ షా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2024, మార్చి 4 నుంచి నాలుగేళ్ల పాటు ఈయన పదవిలో కొనసాగుతారు. భారత్లోని ఔరంగాబాద్లో జన్మించిన ఈయన 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికి 2019లో అప్పటి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఈయన్ను ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించారు.