గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను సీఎం ప్రదానం చేశారు. సేవా వజ్ర కింద రూ. 45,000, సేవా రత్న కింద రూ. 30,000, సేవా మిత్ర రూ. 15,000 నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఇచ్చిన నగదు బహుమతిని 50% పెంచి ఈ సారి ఇస్తోంది.