AP: గందరగోళ పరిస్థితులు, వివాదాల మధ్య గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలోని 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్ష రాయనున్నారు. ఉ.10 నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2కు పరీక్షలు జరగనున్నాయి. అయితే రోస్టర్ విధానంలో తప్పులు సరి చేసే వరకు పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేయగా.. వాయిదా కుదరదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.