రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించండి: ఎమ్మెల్యే నసీర్

59చూసినవారు
రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించండి: ఎమ్మెల్యే నసీర్
గుంటూరు నుంచి నేషనల్ హైవేని కలిపే నందివెలుగు రైల్వే బ్రిడ్జి త్వరగా పూర్తి చేయించాలని సీఎం చంద్రబాబును కోరినట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం చంద్రబాబును కలిసి పూల బొకే అందజేశారు. ఇప్పటికే రూ. 11. 50కోట్ల పనులు పూర్తయ్యాయని మిగిలిన నిధులు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్