జిల్లాలో వరద పరిస్థితులు, తీసుకుంటున్న సహాయక చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అధికారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలకు ప్రభావితమైన కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.