గుంటూరు యార్డులో గురువారం మిర్చి క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. మిర్చియార్డుకు వచ్చిన బస్తాల కంటే విక్రయాలు జరిగిన బస్తాలు అధికంగా ఉన్నాయి. రైతులు గురువారం 52, 263 బస్తాలు యార్డుకు తరలించారు. గత నిల్వలతో కలిపి 57, 271 బస్తాలు విక్రయాలు జరిగాయి. క్రయవిక్రయాలు ముగిసే సమయానికి యార్డులో 19, 564 బస్తాలు నిల్వ ఉన్నాయి. మిర్చి ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయని యార్డు ఉన్నత శ్రేణి అధికారులు తెలిపారు.