పాఠశాల తనిఖీ చేసిన డీఈవో

51చూసినవారు
పాఠశాల తనిఖీ చేసిన డీఈవో
గుంటూరులోని చౌత్ర సెంటర్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి శైలజ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని ఆమె భుజించారు. విద్యార్థులందరూ భుజించే విధంగా ఉపాధ్యాయులందరూ తల్లితండ్రులతో మాట్లాడాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్