పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: సీపీఎం

66చూసినవారు
వరదల కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిందని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం రామారావు మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా ఎక్కువగా వరి పంటకు నష్టం జరిగిందని, ప్రభుత్వాలు పంట నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్