గుంటూరులో ఘనంగా టంగుటూరి జయంతి వేడుకలు

79చూసినవారు
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శుక్రవారం గుంటూరులో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి చేసిన సేవలు మరువలేనివని వారు వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్