తప్పుడు ప్రచారాలతో విధ్వేషాలు సృష్టించేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో మైనార్టీల కోసం బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ ఐదేళ్ల పాలనలో నిధుల్లో కోతపెట్టారని అన్నారు.