గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టౌన్ లూధరన్ చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలో ప్రవేశం గుర్తుగా క్రైస్తవ సమాజం చిన్నారులు, స్త్రీలు ఈత మట్టలతో వీధి వీధిన ర్యాలీ ప్రదర్శన చేశారు. రాజుల రాజు ఏసుక్రీస్తుకు జై అంటూ నినాదించారు. మట్టల ఆదివారం విశిష్టతను ప్రజలకు తెలియజేశారు.