గత వారం రోజులుగా నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, సీపీఎం తెనాలి పట్టణ కార్యదర్శి బాబుప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ కు వినతిపత్రం అందజేశారు. రైతాంగం వేలు పెట్టుబడి పెట్టి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారని, సకాలంలో ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.