ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పదవీకాలం పొడిగింపు

66చూసినవారు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పదవీకాలం పొడిగింపు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.రాజేశ్వర్‌ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల సంఘం (ఏసీసీ) ఆమోదం తెలిపింది. 2024 అక్టోబర్‌ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 1984లో ఆర్‌బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్