అద్దంకి: ఉద్యాన రైతులకు ప్రోత్సాహం

72చూసినవారు
అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఏఈఓ దీప్తి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పూలు మరియు కూరగాయల సాగుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. కూరగాయలు సాగు చేసిన రైతులకు ఎకరాకు 8 వేలు, పూలు సాగు చేసిన రైతులకు 6, 200 రూపాయలు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్