కొండవీడు ఘాట్ రోడ్డును పరిశీలించిన రామచంద్ర రావు

62చూసినవారు
కొండవీడు ఘాట్ రోడ్డును పరిశీలించిన రామచంద్ర రావు
చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు ఘాట్ రోడ్డు వెంబడి కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్. రామచంద్రరావు శుక్రవారం పరిశీలించారు. విరిగిపడిన వాటిని ఆర్ అండ్ బీ శాఖ సమన్వయంతో అటవీశాఖ తొలగిస్తున్నట్లు డీఎఫ్వో తెలిపారు. శనివారం లోగా పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత కొండవీడు నగరవనం సందర్శకులను అనుమతించడంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్