గుంటూరులో వాడి వేడిగా కౌన్సిల్స్ సమావేశం

62చూసినవారు
గుంటూరు నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చటంలో అధికారులు విఫలమవుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారుల ఆక్రమణలు, వీధి వ్యాపారులు, మరుగుదొడ్ల కారణంగా లక్షలాది రూపాయలు ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే గత పాలన, ప్రస్తుత పాలనను పోలుస్తూ చర్చ సాగడంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్