గుంటూరు నాట్కో సెంటర్ సందర్శించిన గుడివాడ ఎమ్మెల్యే

66చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం సందర్శించారు. ఆయన నియోజకవర్గంలో క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో నాట్కో నిర్మాణం, ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కోసం సందర్శించడం జరిగిందని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాట్కో ఏర్పాటు చేయడం శుభపరిణామని, తమ నియోజకవర్గంలో చేపట్టబోయే ప్రాజెక్టుకి ఈ సందర్శన అనుభూతి ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్