గుంటూరు: ఆటో ప్రయాణికుడి బంగారు వస్తువులు చోరీ

79చూసినవారు
గుంటూరు: ఆటో ప్రయాణికుడి బంగారు వస్తువులు చోరీ
ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి బంగారు వస్తువులు చోరీ చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు సంతమాగులూరుకి చెందిన రాములు ఆరోగ్యం బాగోలేక గుంటూరులో ఆసుపత్రిలో చూపించుకొని తిరిగి బస్టాండ్ లో ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో ఆటో టైర్లకు గాలి తగ్గిందని డ్రైవర్ దించేసి వెళ్లాడు. ఆటో దిగి చూసుకుంటే తన జేబులోని బంగారు వస్తువులు చోరీ అయ్యాయని రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్