భారీ వర్షం.. నీట మునిగిన గుంటూరు బస్టాండ్

79చూసినవారు
గుంటూరు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ బస్టాండ్ ఆదివారం పూర్తిగా నీట మునిగింది. దీంతో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. ప్రయాణికులు అడుగు పెట్టడానికి అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్