మిలాద్-ఉన్-నబీ పోస్టర్ల ఆవిష్కరణ

60చూసినవారు
గుంటూరు ఎత్తు రోడ్డులోని మొహిద్దిన్ పాలెం దర్గాలో ఈ నెల 16న మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మొహిద్దిన్ పాలెం దర్గా పీఠాధిపతి సులేమాన్ ఖాదిరి ఆదివారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ వేడుకల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వగురు మహా ప్రవక్త (రసూల్ సొల్లెల్లాహి అలైహి వసల్లమ్) జన్మదినం సందర్భంగా ప్రతీయేటా దర్గాలో వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్