ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే మాధవి

77చూసినవారు
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే మాధవి
గుంటూరు ఎన్జీవో కాలనీ ప్రభుత్వ పాఠశాలని సోమవారం పశ్చిమ ఎమ్మెల్యే మాధవి సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో 2 మంచి నీటి బోర్లలో సమస్యలు వచ్చినట్లు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్